అహ్మదాబాద్, సెప్టెంబర్ 9: పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా పోర్టుకు సమీపంలో 39.5 కిలోల హెరాయిన్ లభ్యమైంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 197.8 కోట్లు ఉంటుందని అంచనా. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.
దుబాయ్లోని జెబెల్ అలీ పోర్టు నుంచి వచ్చిన ఇనుప తుక్కులోని 36 గేర్ బాక్సుల్లో ఈ డ్రగ్స్ను దాచి ఉంచారు. ఫిబ్రవరిలో కోల్కతాకు చేరుకున్న ఈ కంటైనర్లో హెరాయిన్ ఉన్న విషయం ఏటీఎస్కు తెలియగానే అప్రమత్తమై దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నది.
ఇటీవల గుజరాత్లోనూ పలు పోర్టుల్లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. పోర్టుల ద్వారానే విదేశాల నుంచి డ్రగ్స్ దేశంలోకి వస్తున్నట్టు అధికారులు తెలిపారు.