ముంబై: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. తాజాగా ఒక స్కూల్లో 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని టాక్లీ ధోకేశ్వర్ గ్రామంలో రెసిడెన్షియల్ సీబీఎస్ఐ అనుబంధ పాఠశాల అయిన జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 450 మంది విద్యార్థుల నమూనాలను కరోనా పరీక్ష కోసం పంపారు. అందులో 19 మందికి పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. మొత్తం 450 నమూనాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే తెలిపారు. కరోనా సోకిన విద్యార్థులను పార్నర్స్ రూరల్ హాస్పిటల్లోని ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యార్థులతో దగ్గరగా ఉన్న వ్యక్తులను ట్రేస్ చేసి వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.