గాంధీనగర్, అక్టోబర్ 13: పరోటా, చపాతీ రెండూ ఒకటి కాదని గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్ (జీఏఏఏఆర్) తేల్చి చెప్పింది. ప్యాకేజ్జ్ పరోటాపై 18శాతం జీఎస్టీ కట్టాల్సిందేనన్న అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్ ఆర్డర్ (ఏఏఆర్)ను సమర్థించింది. ఏఏఆర్ ఆర్డర్పై వాడిలాల్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్ను వివేక్ రంజన్, మిలింద్ తొరవానే బెంచ్ గురువారం విచారించింది. తమ సంస్థ మలబార్, మిక్స్డ్ వెజిటెబుల్, సాదా పరోటాలను గోధుమపిండి ఉపయోగించి తయారుచేస్తుందని, వీటికి కూడా చపాతీలాగా 5శాతం జీఎస్టీ మాత్రమే విధించాలని వాడిలాల్ ఇండస్ట్రీస్ పిటిషన్లో పేర్కొంది. రుచికోసం కొన్ని పరోటాల్లో కూరగాయలు, ఉల్లిగడ్డ, మెంతికూర కలుపుతామని చెప్పింది. కాగా, పరోటాల్లో గోధుమ పిండిని వాడినా నేరుగా తినలేమని, మూడు నిమిషాలు వేడిచేయాల్సి ఉంటుందని బెంచ్ తెలిపింది. పరోటాలపై 18శాతం జీఎస్టీ విధించాలనే ఆర్డర్ సరైనదేనని తీర్పు చెప్పింది.