గువహటి : సబ్బు డబ్బాల్లో హెరాయిన్ను తరలిస్తుండగా అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) సిబ్బంది, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.18కోట్లు ఉంటుందని అస్సాం ఎస్టీఎఫ్ డీఐజీ పార్థసారథి మహంత చెప్పారు. ఆదివారం ఉదయం హాజో పట్టణంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని, మణిపూర్కు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని విలేకరులతో చెప్పారు.