ఒకే రోజు రికార్డుస్థాయిలో నియామకం
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: రికార్డుస్థాయిలో మంగళవారం మూడు హైకోర్టులకు కొత్తగా 17 మంది జడ్జిలు నియమితులయ్యారు. వీరిలో 15 మంది న్యాయవాదులు కాగా ఇద్దరు జ్యుడిషియల్ అధికారులు. వీరిలో 8 మంది అలహాబాద్ హైకోర్టుకు, అయిదుగురు గువాహటి హైకోర్టుకు, నలుగురు మద్రాస్ హైకోర్టుకు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం వివిధ హైకోర్టుల జడ్జిలుగా నియామకానికి పలువురి పేర్లను గత నెలలో కేంద్రానికి సిఫారసు చేసింది. అప్పటి నుంచి జడ్జిల నియామకం జరుగుడం ఇది మూడో విడుత. ఇటీవల కాలంలో ఒకేరోజు ఇంతమంది జడ్జిలను నియమించడాన్ని చూడలేదని సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు. అలాగే గువాహటి హైకోర్టులో ముగ్గురు అదనపు జడ్జిలకు పూర్తిస్థాయి జడ్జిలుగా పదోన్నతి లభించింది.