తాజాగా పెట్రోల్, డీజిల్పై లీటరుకు 35 పైసలు పెంపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచుకొంటూ పోతున్నాయి. పెట్రో ధరల మంటలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ఈ నెలలో గడిచిన 16 రోజుల్లో లీటర్ పెట్రోల్ రేటు 4.08 రూపాయలు పెరిగింది. డీజిల్ రేటు 4.76 రూపాయలు పెరిగింది. శనివారం చమురు కంపెనీలు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు 110.08కి పెరిగింది. లీటర్ డీజిల్ రేటు 103.15కు చేరింది. శనివారం నాటి పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.49కి పెరుగగా.. ముంబైలో 111.43కి చేరింది. అలాగే లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.94.22కు ఎగబాకింది.