న్యూఢిల్లీ: డార్క్నెట్ ఆధారంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 15 వేల ఎల్ఎస్డీ బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 2.3 కిలోల గంజాయి, రూ.4.65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.20 లక్షల బ్యాంకు డిపాజిట్లను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉండొచ్చని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు. పోలండ్, నెదర్లాండ్ నుంచి వీటిని తీసుకొచ్చి దేశమంతటా సరఫరా చేస్తున్నారు. ఎల్ఎస్డీ అనేది సింథటిక్ కెమికల్ ఆధారిత డ్రగ్. వీటిని నేరుగా మింగుతారు లేదా చప్పరిస్తారు.