హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ఏపీకి చెందిన 141 మంది ఆచూకీ లభించడం లేదు. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఏపీకి చెందిన 482 మంది, హౌరా ఎక్స్ప్రెస్లో 89 మంది ప్రయాణించారని రైల్వే శాఖ వెల్లడించింది.
వీరిలో చాలా మంది క్షేమంగా ఉన్నారని గుర్తించింది. అయితే, 141 మంది ఆచూకీ మాత్రం లభించడం లేదు. కొందరి ఫోన్లు స్విచ్ఛాఫ్లో ఉండగా, కొన్ని రింగ్ అవుతున్నా ఎత్తడం లేదు. దీంతో వాళ్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.