Sucheta Satish | తిరువనంతపురం: కేరళ యువతి సుచేత సతీశ్ గొప్ప లక్ష్యం కోసం 140 భాషల్లో పాట పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఒకే కాన్సర్ట్లో అత్యధికంగా 140 భాషల్లో పాడినందుకు ఆమెను ఈ రికార్డు వరించింది. వాతావరణం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సంగీత విభావరిలో ఆమె తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, అందరి మన్ననలను అందుకున్నారు. 2023 నవంబరు 24న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో ఈ ‘కాన్సర్ట్ ఫర్ ైక్లెమేట్’ జరిగింది.
తాను పాడిన పాటను ఆమె సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. వీటిని విన్నవారంతా మంత్రముగ్ధులై, ఆమెను అభినందిస్తున్నారు. 9 గంటల్లో 140 భాషల్లో పాట పాడి ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. భగవంతుని దయ వలన ఈ రికార్డును సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. దుబాయ్లో జరిగిన సీఓపీ 28 సదస్సులో 140 దేశాలు పాల్గొన్నాయి కాబట్టి, దానిని గుర్తు చేస్తూ 140 భాషల్లో పాడాలని అనుకున్నారు.