Uday Samant | మహారాష్ట్ర (Maharastra) రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ప్రభుత్వాన్ని కూల్చేసిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde).. ఆ తర్వాత బీజేపీతో జట్టుకట్టి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఠాక్రే వర్గంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. శివసేన (Shiv Sena)కు చెందిన ఎమ్మెల్యే (MLAs)లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్నాయి.
మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సావంత్ (Uday Samant ) మాట్లాడుతూ.. మహాబలేశ్వర్లోని సీఎం షిండేతో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రహస్యంగా సమావేశమయ్యారని అన్నారు. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో టచ్లో ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. వారితోపాటు ఎన్సీపీ (Nationalist Congress Party)కి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఏక్నాథ్ షిండే గ్రూప్తో టచ్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అస్థిరత నెలకొందని ఆయన అన్నారు. దీంతో ఉదయ్ సావంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
Also Read..
India Corona | 24 గంటల్లో 7,533 కొత్త కేసులు.. 44 మరణాలు
Brij Bhushan: ఆ రోజే వస్తే.. ప్రాణాలు వదిలేస్తా: బ్రిజ్ భూషణ్ వీడియో
Filmfare Awards 2023 | అట్టహాసంగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటిగా ఆలియా భట్