న్యూఢిల్లీ: వీడియోకాల్ స్క్రీన్షాట్లతో ఓ వృద్ధుడిని బెదిరించి(Extortion Case) అతని వద్ద నుంచి 13 లక్షలు వసూల్ చేసిన ఇద్దర్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రాజస్థాన్కు చెందిన భర్కాత్ ఖాన్, రిజ్వాన్ను సైబర్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. బాధిత వృద్ధుడికి జూలై 18వ తేదీన వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. ఆ వీడియోకాల్లో ఓ మహిళ నగ్నంగా కనిపించింది.
అయితే ఆ కాల్కు చెందిన స్క్రీన్షాట్స్ తీశారు. బాధితుడి ముఖం ఉన్న స్క్రీన్షాట్ను ఆ వృద్ధుడికి పంపి అతన్ని బెదిరించడం ప్రారంభించారు. వేర్వేరు నెంబర్ల నుంచి అతనికి ఫోన్ కాల్స్ వచ్చాయి. సైబర్ క్రైం ఢిల్లీ పోలీసు స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నామని చెబుతూ ఆ వృద్ధుడిని బెదిరించారు.
డబ్బులు ఇవ్వకుంటే ఆ స్క్రీన్షాట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని హెచ్చరించారు. అయినా ఆ వృద్ధుడు బెదరలేదు. కానీ స్క్రీన్షాట్లో ఉన్న మహిళ ఉరి వేసుకుని మృతిచెందినట్లు బాధితుడి వాట్సాప్కు పంపారు. నిందితుడు మళ్లీ బెదిరించడంతో ఆ వృద్ధుడు 12 లక్షల 80 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా అల్వార్కు చెందిన ఖాన్ను తొలుతు అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమీషనర్ రోహిత్ మీనా తెలిపారు. అతని వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను రికవర్ చేశారు. వీడియో కాల్స్ చేసి జనం నుంచి డబ్బులు వసూల్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు తేల్చారు.