హైదరాబాద్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని నాగ్పూర్ సిటీకి చెందిన 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాగ్పూర్ సిటీ పోలీసులు ( Nagpur city police ) ఆదివారం ఉదయం ఈ విషయాన్ని వెల్లడించారు. నాగ్పూర్ సిటీ పోలీసులు ఇటీవల పుణేలో జరిగిన 10 రోజుల ట్రెయినింగ్ ప్రోగ్రామ్కు వెళ్లి వచ్చారని, వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చింది.
12 మంది పోలీసులకు పాజిటివ్ రావడంతో నాగ్పూర్ సిటీ పరిపాలనా యంత్రాంగంతోపాటు నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన పోలీసులను క్వారెంటైన్లో ఉంచారు. వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.