కరువులో వాంతి అంటే ఇదే మరి. బొగ్గు కొరత కారణంగా అనేక రాష్ట్రాలు విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో బొగ్గు సరఫరా చేసే రైళ్ల సమయం ఆదా కావడానికి కేంద్రం అధిక సంఖ్యలో రైళ్లను కూడా రద్దు చేసింది. అయితే.. బొగ్గును సరఫరా చేస్తున్న ఓ రైలు పట్టాలు తప్పిపోయింది. బొగ్గుతో నిండుగా వున్న 12 బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ రైలు బొగ్గును నింపుకొని కాన్పూర్ నుంచి గాజియాబాద్కు వెళ్తోంది. ఇటావా ప్రాంతంలోని ఫ్రెట్ కారిడార్ దగ్గర 12 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో బొగ్గు కిందపడిపోయింది. ఈ రైలు పట్టాలు తప్పడంతో రైలు పట్టాలు కూడా ధ్వంసమయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, అధికారులు ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ రైల్ పట్టాలు తప్పడంతో పక్కనేనున్న ఎలక్ట్రిక్ స్తంభాలు కూడా కిందపడిపోయాయి. రైలు బోగీలు కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి.