కోల్కతా: భారతీయ రైల్వేని (Indian Railways) నిర్లక్ష్యం ఇప్పట్లో వీడేలా లేదు. ఈ నెల 2న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఒడిశాలోని (Odisha) బహనాగ బజార్ (Bahanaga Bazar) స్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 292 మంది చనిపోగా, 1100 మంది మరణించారు. దీంతో ఇది దేశ రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా నిలిచిపోయింది. తాజాగా మరో భారీ ప్రమాదం జరిగింది. ఒకే పట్టాలపై వెళ్తున్న రెండు గూడ్సు రైళ్లు (Goods Trains) ఢీకొన్నాయి. రవాణా రైళ్లు కావడంతో ప్రణాపాయం తప్పింది. అయితే ఓ రైలుకు చెందిన లోకోపైలట్ తీవ్రంగా గాయపడ్డారు.
అది పశ్చిమ బెంగాల్లోని (West Bengal) బంకురా (Bankura) జిల్లాలోని ఓండా (Onda) రైల్వే స్టేషన్. ఆదివారం ఉదయం 4 గంటలు అవుతున్నది. ఆ స్టేషన్ మీదుగా ఒకే ట్రాక్లో రెండు గూడ్సు రైళ్లు వెళ్తున్నాయి. దీంతో సిబ్బంది ఒక రైలును లూప్లైన్ నిలిపివేశారు. అయినప్పటికీ ఎదురుగా వస్తున్న గూడ్సు రైలు.. నిలిపిఉంచిన రైలు ట్రాక్పైకే దూసుకొచ్చింది. ఇంకేముంది ఆగి ఉన్న గూడ్సును మరో రవాణా రైలు ఢీకొట్టింది. రైలు స్పీడ్లో ఉండటంతో ఎదురుగా ఉన్న రైలు బోగీలపైకి ఎక్కేసింది. దీంతో 12 డబ్బాలు పట్టాలు తప్పాయి. అయితే అదేసమయంలో ఆ మార్గంలో మరో రైలు రాకపోవడంతో భారీ ప్రమాదమే తప్పినట్లయింది. దీనిని బట్టిచూస్తే రైల్వే సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలిసిపోతుంది.
అయితే రెండు రైళ్లు ఖాళీగా వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. ఓ లోకోపైలట్కు గాయాలయ్యాయని చెప్పారు. కాగా, ఒకే ట్రాక్పైకి రెండు రెళ్లు ఎలా వెళ్లాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని వెల్లడించారు. ఈఘటనపై దర్యాప్తు ప్రారంభించామన్నారు.
#WATCH | West Bengal: Two goods trains collided at Onda railway station in Bankura. Rail operation on Kharagpur–Bankura–Adra line has been halted. More details awaited. pic.twitter.com/T4sL5rn7Rp
— ANI (@ANI) June 25, 2023