న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికన్లపై ప్రభుత్వం కొరఢా రుళిపిస్తోంది. వీసా గడువు ముగిసిన 12 మంది ఆఫ్రికన్లను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. గత మూడు రోజుల్లో ఈ అరెస్టులు జరిగాయి. ద్వారకా జిల్లాలో జరిగిన నాలుగు ఆపరేషన్లలో వారిని పట్టుకున్నారు. 12 మంది నుంచి పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అందర్నీ ఫారినర్స్ రీజినల్ రిస్ట్రేషన్ ఆఫీసర్ ముందు ప్రవేశపెట్టారు. ఆఫ్రికన్ల డిపోర్టేషన్కు ఎఫ్ఆర్ఆర్వో ఆదేశించారు. ద్వారక ప్రాంతాన్ని నేర రహితంగా మార్చేందుకు స్థానిక పోలీసులు ఆపరేషన్ వర్చెస్వా చేపట్టారు. అప్పటి నుంచి గ్యాంగ్స్టర్లు, స్నాచర్లు, దొంగలను పట్టుకున్నారు. ఆఫ్రికన్లు ఎక్కువగా డ్రగ్ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.