తంజావూర్/చెన్నై, ఏప్రిల్ 27: తమిళనాడులోని తంజావూర్లో ఘోర ప్రమాదం సంభవించింది. కరిమేడు అప్పర్ ఆలయ రథోత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. మృతు ల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రథానికి హైటెన్షన్ వైర్ తగలడంతో ప్రమాదం జరిగింది. దుర్ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. మరోవైపు, ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.