గురుగ్రామ్: దేశంలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. నిమ్మకాయలు, టమాటాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సామాన్యులు వాటిని కొనాలంటేనే భయపడుతున్నారు. దీంతో గురుగ్రామ్లోని (Gurugram) ఓ హోల్సేల్ మార్కెట్లో దుండగులు పది బస్తాల నిమ్మకాయలు, ఐదు క్రేట్ల టమాటాలు, 15 ప్యాకెట్ల క్యాప్సికమ్ను ఎత్తుకెళ్లారు.
గురుగ్రామ్లోని ఖంద్సా హోల్సేల్ మార్కెట్కు సందీప్ అనే డ్రైవర్ గురువారం రాత్రి కూరగాయలు తీసుకొచ్చాడు. అయితే తెల్లారి వచ్చి చూడగా షాప్లో అవి కనిపించకుండా పోయాయి. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం ఉదయం షాప్ షెట్టర్ సగం తెరచి ఉన్నదని, పది బస్తాల నిమ్మకాయలు, 35 క్రేట్ల టమాటాలు, 15 సంచుల క్యాప్సికమ్ను ఎత్తుకెళ్లారని అందులో పేర్కొన్నాడు.
వాటి విలువ హోల్సేల్ మార్కెట్లో రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఉంటుందని, అదే రిటైల్ మార్కెట్లో రూ.లక్షా 50 వేల దాకా ఉంటుందని చెప్పాడు. కూరగాలయ ధరలు పెరగడంతో వాటిని ఎత్తుకెళ్లి ఉండొచ్చని సందీప్ వెల్లడించాడు. కాగా, ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.