న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నది. దాదాపు సగం రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఒకేరోజు కొత్తగా 10 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. దాంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. అయితే మొత్తం 20 కేసులలో 10 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కూడా అయ్యారని సత్యేంద్ర జైన్ చెప్పారు.
మన రాష్ట్రంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్నది. తాజాగా ఇవాళ నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు.