న్యూఢిల్లీ: వాయు కాలుష్యంపై తాజా అధ్యయనం కొన్ని కఠినమైన వాస్తవాలు వెల్లడించింది. ఈ భూమి మీద 1 శాతం కంటే తక్కువ ప్రాంతంలో మాత్రమే వాయు కాలుష్యం సురక్షితమైన స్థాయిలో ఉన్నదని, దాదాపు 99.82 శాతం ప్రపంచ భూ విస్తీర్ణంలో వాయు కాలుష్యం కనీసంగా పీఎం 2.5 స్థాయిలో ఆవరించి వున్నదని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన వాయు కాలుష్య సురక్షిత స్థాయి పీఎం 2.5 ఉండాలి. ఈ ఆధ్యయనం లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ప్రచురితమైంది. ప్రపంచ జనాభాలో 0.001 శాతం మంది ప్రజలు మాత్రమే సురక్షితమైన, ఆమోదయోగ్యమైన గాలి పీల్చుతున్నారని ఆస్ట్రేలియా, చైనా శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.