యూపీలో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 692 మంది అభ్యర్థులు ఈ పోటీలో నిలబడ్డారు. సాయంత్రం 6 గంటల వరకూ ఈ పోలింగ్ కొనసాగనుంది. ఇక.. ఉదయం 11 గంటల వరకూ 21 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. ఇక.. ఈ దఫా ఎన్నికల్లో అమేధీ, రాయ్బరేలీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ వంటి కీలక నియోజకవర్గాలున్నాయి. దాదాపు 2.24 కోట్ల మంది ఈ ఐదో దఫా ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
సుల్తాన్పూర్, చిత్రకూట్, ప్రతాప్గఢ్, కోశాంబి, ప్రయాగరాజ్, బారాబంకి, బారిచ్, శ్రావస్తి, గోండా లాంటి ముఖ్యమైన జిల్లాల్లో ఈ పోలింగ్ జరుగుతోంది. ఐదో దశ పోలింగ్లో ఈ జిల్లాలే ఎక్కువ ప్రాధాన్యం వహిస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటల వరకూ అమేధీలో 8.67 శాతం, అయోధ్యలో 9.44 శాతం, బర్హిఆలో 7.45 శాతం, బారాబంకీలో 6.21 శాతం, చిత్రకూట్లో 8.80 శాతం, గోండాలో 8.31 శాతం, కోశాంబీలో 11.40 శాతం, ప్రతాప్గఢ్లో 6.95 శాతం, ప్రయాగరాజ్లో 6.95 శాతం, రాయ్బరేలీలో 7.48 శాతం పోలింగ్ నమోదైంది.