Public Charging Ports | న్యూఢిల్లీ, మార్చి 30: దేశ ప్రజలకు కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్) శనివారం కీలక సూచన చేసింది. హోటళ్లు, బస్టాండ్లు, కేఫ్లు, ఎయిర్పోర్టులు తదితర ప్రదేశాల్లో ఉండే పబ్లిక్ చార్జింగ్ పోర్టళ్ల స్మార్ట్ఫోన్లకు చార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నది. పబ్లిక్ చార్జింగ్ పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్లలోని సమాచారాన్ని చోరీ చేయవచ్చని, హానికరమైన యాప్లను ఫోన్లలో ఇన్స్టాల్ చేయవచ్చని తెలిపింది.
డాటాను తొలగించి మళ్లీ రిస్టోర్ చేయడానికి డబ్బులు అడిగే అవకాశం కూడా ఉందని పేర్కొన్నది. బయటకు వెళ్లినప్పుడు పవర్ బ్యాంకులు లేదా చార్జర్లను తీసుకెళ్లాలని సెర్ట్ సూచించింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ చార్జింగ్ పోర్టళ్లలో చార్జింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఫోన్లను స్విచాఫ్ చేసి పెట్టాలని సూచించింది. ఏదైనా సైబర్ మోసానికి గురైతే www.cybercrime.gov.in పోర్టల్లో లేదా 1930 నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నది.