లండన్: బ్రిటన్ యువరాజులు విలియం, హ్యారీ తమ మధ్య ఉన్న విభేదాలను కాసేపు పక్కనపెట్టారు. తమ తల్లి ప్రిన్సెస్ డయానా 60వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహం ఆవిష్కరించారు. లండన్లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ ఆవరణలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాజ కుటుంబంలో చిచ్చు రేగిన తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇలా కలవడం ఇది రెండోసారి మాత్రమే. ఆ మధ్య ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియల్లో కలిసిన ఈ ఇద్దరూ.. మళ్లీ ఇప్పుడిలా చేతులు కలిపారు. ఈ విగ్రహంలో డయానాతోపాటు ఆమె ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
ఆ మధ్య ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్.. రాజ కుటుంబంపై వర్ణ వివక్ష ఆరోపణలు చేసిన సమయంలో ప్రిన్స్ విలియం మాత్రం తమ కుటుంబాన్ని సమర్థించాడు. అప్పటి నుంచీ ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చాయి. హ్యారీ రాచరికాన్ని వదిలేసుకొని భార్యతో కలిసి అమెరికా వెళ్లి సెటిలైన విషయం తెలిసిందే.