న్యూఢిల్లీ, జూన్ 6: కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గర్భిణులను అత్యంత ప్రాధాన్యం గల గ్రూపులో చేర్చాలని ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం సూచించింది. కరోనాతో గర్భిణుల మరణాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వారికి టీకాలు వేయాలని సూచిస్తూ వర్ధమాన్ మహావీర్ వైద్య కళాశాల, సఫ్దర్జంగ్ దవాఖానల వైద్యుల బృందం ఒక నివేదికను రూపొందించింది. వ్యాక్సిన్లు సురక్షితమని, సమర్థంగా పనిచేస్తున్నాయని, పుట్టే శిశువులకు కూడా రక్షణ కల్పిస్తాయని రుజువు అవుతున్నందున గర్భిణులకు టీకాలు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.