తుంగతుర్తి, జూలై 10 : మండలంలోని వెంపటి గ్రామానికి చెందిన కొండగడుపుల చందు, బాషబోయిన ప్రవీణ్ ఇబ్రహీంపట్నంలో జరిగిన ఫీట్ ఇండియా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి నేషనల్ మీట్కు ఎంపికయ్యారు. వారు ఈ నెల 28, 29, 30 తేదీల్లో మధ్యప్రదేశ్లో జరిగే నేషనల్ మీట్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి క్రీడల్లో రాణిస్తున్నప్పటికీ ఇతర రాష్ర్టాల్లో జరిగే పోటీలకు వెళ్లడానికి ఆర్థికంగా ఇబ్బంది పడ్డామన్నారు.
ఈ తరుణంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తమకు ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించారని తెలిపారు. తమ కష్టాలను విన్నవించిన వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి ఆడి జాతీయ స్థాయిలో రాణిస్తామని చెప్పారు. గ్రామం నుంచి ఇద్దరు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.