యాదాద్రి, ఫిబ్రవరి17: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అనుబంధాలయమైన పాతగుట్టలో వారం రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు గురువారం నిర్వహించిన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. స్వామికి ఆగమశాస్ర్తానుసారం వేదమంత్ర పఠనాలతో అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 108 కళశాల్లో పంచామృతాలు, పవిత్ర తీర్థ జలాలు, సుగంధ ఫల రసాలు, నారికేళ జలాలను అభిమంత్రించి పవిత్ర ద్రవ్యాలతో, తీర్థరాజములతో కల్యాణోత్సవ మూర్తులను, మూలవరులను అభిషేకించడమే అష్టోత్తర శతఘటాభిషేకం ప్రత్యేకత అని అర్చకులు తెలిపారు. అష్టోత్తరశతం 108 సంఖ్య భగవానుని సృష్టిలోని సమస్థాన్ని తెలిపే సంఖ్య అని, ఈ సంఖ్యలో భగవానుని వైభవం ప్రకటితం అవుతున్నందున 108 కలశాల ద్వారా అభిషేకిస్తే ముక్తి లభించి పరమాత్ర అనుగ్రహం సులభంగా పొందవచ్చని ప్రధానార్చకులు నల్లందిఘల్ లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు. సృష్టిలోని సమస్త వస్తుజాలం భగవానుడి స్వరూపం, వాటిలో అంతర్లీనంగా ఉన్న భగవానుడిని ఆరాధించడం అనాదిగా ప్రసిద్ధమైనదని చెప్పారు. ఈ సందర్భంగా 108 కలశాలతో పూజ చేశారు.
జీవ నదుల నుంచి తెప్పించిన జలాలతో సుమారు నాలుగు గంటల పాటు శ్రీవారికి అభిషేకం చేశారు. పంచభూతాల్లోని పృథ్వీజలాలు, వాయువు, తేజస్సుతత్వాలు ప్రకృతి నిండా ఆవరించిన ఫలభరిత మధుర రసాల సృష్టికి కారణభూతమైన 96 తత్వాలు(తిథి, వార,నక్షత్ర) పక్ష, మాస, సంవత్సర స్వరూపాలు, ద్వాదశాదిత్యులు తదితర 108 కలశాలతో పూజ జరిపారు. కలశతీర్థం, పుణ్యా హ జలానికి వేదమంత్రాలతో విశ్వక్సేన పూజ నిర్వహించారు. ప్రధాన కలశంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కలశతీర్థం పుణ్యజలాన్ని కలిపి శ్రీవారికి అభిషేకం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఉత్సవ కైంకర్యాన్ని యాదాద్రి ఆలయ ఉప ప్రధానార్చకులు జరిపారు. ఘటం అనగా శరీరం అని, 108 తత్వాలకు నిలయమైన శరీర మండలం భగవదర్పణం చేస్తే జన్మసార్థకం అని అన్నారు. అనంతరం ఉత్సవాల్లో పాల్గొన్న పారాయణీలను సన్మానించారు. ఉత్సవ నిర్వాహకులకు, భక్తులకు మహదాశీర్వచనం చేసి బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలికారు.
ఆగమశాస్ర్తానుసారంగా ఉత్సవాలు
పాతగుట్ట ఉత్సవాలు ఆగమశాస్ర్తానుసారం వైభవంగా నిర్వహించాం. సంప్రదాయాలను పెంపొందించేలా నిర్వహించాం. శ్రీవారికి జరిగే కైంకర్యాల్లో గతంలో కన్నా ఈసారి ఎక్కువగా పారాయణాలు జరిగాయి. ఉత్సవాలు విజయవంతం చేయడంలో అర్చకులు, వేదపండితులు, పారాయణికులు, రుత్వికులు చూపిన చొరవ ప్రశంసనీయం.
– నల్లందిఘల్ లక్ష్మీనర్సింహాచార్యులు, ఆలయ ప్రధానార్చకుడు
ఉత్సవాలు విజయవంతం
పాతగుట్ట బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. ఉత్సవాలకు ఏడాదికేడాదికి ప్రాధాన్యం పెరుగుతున్నది. శ్రీవారి సేల నుంచి సంప్రయదాబద్ధంగా నిర్వహించే పూజల వరకు ఘనంగా జరిగాయి.