వేములపల్లి: గొర్రెల మందపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో 20 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని రావు లపెంట గ్రామ శివారులో భీమారం-సూర్యాపేట రహదారిపై బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన ప్రకారం రావుల పెం ట గ్రామానికి చెందిన ముక్క దేవయ్య తన గొర్రెల మందను ఇంటి వద్ద నుంచి ఎరుకల గుట్ట క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న వ్యవసాయ బీడు భూములలో మేత మేపేందుకు బయలుదేరాడు.
ఈ క్రమంలో గొర్రెల మందతో రోడ్డు మీద వెళు తూ రావులపెంట శివారు వద్దకు చేరుకోగా రోడ్డు పనుల నిమిత్తం శెట్టి పాలెం వైపు కంకర డస్టుతో వెళుతున్న టిప్పర్ లారీ అదుపు తప్పి గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడిక్కడే 20 గొర్రెలు మృతి చెందినట్లు భాదితుడు దేవయ్య తెలిపాడు. సుమారు రూ 2లక్షల మేర నష్టం జరిగినట్లు భాదితుడు కన్నీటి పర్వంతమయ్యాడు.