ఆత్మకూర్.ఎస్, జూన్ 30 :గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో జీజేఆర్ కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో జరిగిన పోటీలను మంత్రి తిలకించారు. వాలీబాల్ ఆడి అందరిలోనూ ఉత్సాహం నింపారు. క్రీడలతో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.
క్రీడలు మానసిక ప్రశాంతతతో పాటు, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జీజేఆర్ క్రీడాపోటీలను శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు. యువతకు క్రీడల్లో ఆసక్తిని పెంపొందించేందుకు మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా కోలాట బృందంతో కలిసి ఆయన కోలాటం ఆడారు. మంత్రితో ఫొటోలు దిగేందుకు యువత పోటీపాడ్డారు. కార్యక్రమం లో ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, సర్పంచ్ తంగెళ్ల వీరారెడ్డి, ఎంపీటీసీ మిర్యాల వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, బోల వెంకట్రెడ్డి, బ్రహ్మం, భిక్షం పాల్గొన్నారు.