భూధాన్ పోచంపల్లి, జనవరి 3 : చేనేత పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర పవర్ లూమ్స్ టెక్స్టైల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ అన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత టై అండ్ డై సిల్ చీరెల ఉత్పత్తిదారుల సంఘం 45వ వార్షికోత్సవ మహాసభ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత పరిశ్రమ సంక్షేమ కోసం ప్రభుత్వ పలు పథకాలు అమలు చేస్తుందన్నారు. చేనేత పరిశ్రమతో గౌరవం ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు ఉన్నందున ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకోవాలని సూచించారు.
చేనేత వృత్తిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, చేనేత కార్మికులకు నూలు సబ్సిడీని నేరుగా కార్మికులు అకౌంట్లో జమ చేసేందుకు అధికారులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. అనంతరం టై అండ్ డై అధ్యక్షుడు తడక రమేశ్కు బిజినెస్ ఎక్స్లెంట్ అవార్డును ప్రవీణ్ ప్రదానం చేసి సన్మానించారు. కార్యక్రమంలో పోచంపల్లి సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్లు చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, జిందం కళాచక్రపాణి, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, చేనేత నాయకులు తడక వెంకటేశ్వర్లు, బడుగు దానయ్య, సీత శ్రీరాములు, గర్దాసు బాలయ్య, గుజ్జ సత్యనారాయణ,భారత లవ కుమార్, భోగ భానుమతి విష్ణు, దోర్నాల శేషగిరి, తడక యాదగిరి, ఎన్నం శివకుమార్ పాల్గొన్నారు.