బీబీనగర్, డిసెంబర్ 4: ఓటరు నమోదు కార్యక్రమాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఆర్డీఓ భూపాల్రెడ్డి అన్నారు. ఆదివా రం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని భట్టుగూడెం, కొండమడుగు, బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆర్టీఓ మా ట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారంతా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్రెడ్డి, ఆర్ఐ హరికిషన్రెడ్డి, బీఎల్ఓలు పాల్గొన్నారు.
భూదాన్పోచంపల్లి : అర్హులందరూ ఓటు నమోదు చేయించుకోవాలని భువనగిరి ఆర్డీఓ భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పోచంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో 159, 169 పోలింగ్, ఓటరు నమోదు కేంద్రాలను ఆయన పరిశీలించారు. నూతన ఓటరు జాబితా, తొలగింపు వంటి అంశాలపై బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ మమత, ఆర్ఐ వెంకట్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సైదిరెడ్డి, బీఎల్ఓలు జంగ మ్మ, వసంత, చంద్రకళ, కమ్రూన్నిసా, రమ్య, పారిజాత, పద్మజ, శివరాణి, సంతోష,రాధిక, పారిజాత పాల్గొన్నారు.