రామగిరి, ఏప్రిల్ 03 : ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా నల్లగొండ జిల్లా వాసి శ్రీరామోజు రఘు నియమితులయ్యారు. శ్రీరామోజు రఘు పాఠశాల స్థాయి ప్రాథమిక తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పన నుండి విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్యాంశాల నిర్మాణం వరకు తన విశిష్ట ప్రతిభను చాటుకున్నారు. విద్యావేత్తగా, సాహిత్య సేవకుడిగా గుర్తింపు పొందిన డా. శ్రీరామోజు రఘు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం తెలుగు సాహిత్య రంగానికి గర్వకారణంగా పలువురు పేర్కొంటున్నారు. ఈ పదవిలో ఆయన మరింత సమర్థవంతంగా పనిచేసి, తెలుగు విద్యా వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేయాలని జిల్లాకు చెందిన ప్రముఖ అధ్యాపకులు, కవులు, రచయితలు, పరిశోధన విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, పరిశోధక విద్యార్థి పల్లె సతీశ్ ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.