– జనసేన హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి నాగేశ్వర రావు
నేరేడుచర్ల, మార్చి 16 : హిందూ, ముస్లింలు ఐక్యతతో ముందుకు సాగాలని, అలాంటప్పుడే సమాజం బలంగా ముందుకు వెళ్తుందని జనసేన పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి సరికొప్పుల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పెద్ద మసీదీలో 14వ వార్డు కౌన్సిలర్, జనసేన నాయకురాలు విజయలక్ష్మి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. రంజాన్ మాసం అంటే ఓపిక, ప్రేమ, సహనం అన్నారు. వీటన్నింటిని పాటిస్తూ ముస్లింలు ఈ దీక్షను కొనసాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొమ్మరాజు శ్రీను, సాయి చరణ్, అనిల్ నాయుడు, ప్రసాద్, అర్జున్, ఇబ్రహీం, గౌస్, ఇస్త్యక్, ఖాజా, అక్బర్, రహీం, ముస్లిం పెద్దలు, జన సైనికులు పాల్గొన్నారు.

‘హిందూ, ముస్లింల ఐక్యతతో సమాజం ముందుకు’