నందికొండ, డిసెంబర్ 30 : నందికొండ హిల్కాలనీలోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలను విజయపురి టౌన్ ఎస్ఐ సంపత్గౌడ్ శనివారం ప్రారంభించారు.
జిల్లా నెట్బాల్ క్రీడా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ పోటీల్లో 22 జిల్లాల నుంచి 24 జట్లు పాల్గొంటున్నాయని, మూడు రోజుల పాటు క్రీడలు కొనసాగుతాయని తెలిపారు. మొదటి రోజు బాలుర, బాలికల విభాగాల్లో జగిత్యాలపై నల్లగొండ జట్లు విజయం సాధించాయి. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంద రఘువీర్, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.