నల్లగొండ ప్రతినిధి, జూలై3(నమస్తే తెలంగాణ) : రైతుబంధు డబ్బులు సోమవారం ఐదు ఎకరాల లోపు లోపు రైతులందరికీ వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.83 లక్షల మంది రైతులకు రూ.748. 10 కోట్లు రైతుల ఖాతాలకు చేరాయి. తొలిరోజు ఎకరం లోపు రైతులతో మొదలైన పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఐదు ఎకరాల లోపు రైతులందరికీ పూర్తయింది.
సోమవారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 18,885 మంది రైతులకు రూ.42.61 కోట్లు ఖాతాల్లో పడ్డాయి. అందులో నల్లగొండ జిల్లాలో 9228 మంది రైతులకు రూ. 20.83 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 4,607 మంది రైతుల రూ.10.39 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,050 మంది రైతులకు రూ.11.39 కోట్ల రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. దాంతో ఇప్పటివరకు మొత్తం నల్లగొండ జిల్లాలో 4,32,737 మంది రైతులకు రూ. 373.61 కోట్లు, సూర్యాపేటలో 2,42,262 మంది రైతులకు రూ.201.79 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,08,691 మంది రైతులకు రూ.172.68 కోట్లు రైతులకు పెట్టుబడి సాయంగా అందాయి.
ఐదు రోజుల్లో వచ్చిన రైతు బంధు జిల్లాల వారీగా….