కోదాడ, ఏప్రిల్ 27 : తెలంగాణ జాతి పిత, ఉద్యమ నేత, 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహా మనిషి కేసిఆర్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ చీమ నరేష్ కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ బీఆర్ఎస్ కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన మహనీయుడు అని కొనియాడారు. రెండున్నర సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంపై విరక్తి కలిగిందన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని, ఈ పరిణామంలో కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల ఆగ్రహానికి గురవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే.బాబు, పిట్టల భాగ్యమ్మ, కర్ల సుందర్ బాబు, ఇమ్రాన్, కమతం రాజేశ్వరి, చలిగంటి వెంకట్, కాసాని మల్లయ్య గౌడ్, సంపేట ఉపేందర్ గౌడ్, అబ్బో గొర్రె రాజేష్, దొంగర శ్రీను, కరీముల్లా బాబా, శ్రీధర్, కృష్ణయ్య, ఏసు, లక్ష్మయ్య, జానీ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.