రామగిరి, ఫిబ్రవరి 4 : కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేసేందుకు సన్నద్ధమవుతూనే వారి ఉద్యోగ విరమణ వయస్సును మూ డేం డ్లు పెంచుతూ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతూ జీఓ
ప్రస్తుతం జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాం ట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏండ్లు ఉంది. వారి గరిష్ట వయస్సు 61 యేండ్లకు మూడేండ్లు పెంచుతూ ప్రభుత్వం జీఓ CIE /3/2023- SERVICES-III-CIE విడుదల చేసింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే త్వరలో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు సైతం ఉద్యోగ విరమణ వయస్సు పెంచేలా జీఓ విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రిన్సిపాళ్ల ఖాతాల్లోకి వేతనాలు..
ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు జి ల్లా ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అధికారి ఖాతా నుంచి వేతనాలు చెల్లించేవారు. ఈ విధానంతో వేతనాలు చెల్లించడంతో కొంత ఆలస్యం జరిగేది. ప్రభు త్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వేతనాల చెల్లింపు ప్రక్రియ కళాశాల ప్రిన్సిపాళ్ల ఖాతాలకు మళ్లీస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. అలాగే ప్రిన్సిపాళ్లు బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు చెల్లించే వెసులుబాటు కల్పించా రు. ఇది కాంట్రాక్టు అధ్యాపకులకు సైతం ఊరట నిచ్చే విషయం.
335 మంది కాంట్రాక్టు అధ్యాపకులు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 335 మంది కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 55 మంది, 5 పాలిటెక్నికల్ కళాశాలల్లో 48మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు.
ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం హర్షనీయం
కాంట్రాక్టుల అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచడం హర్షనీయం. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అవకాశం కల్పించి మాకు గౌరవం కల్పించారు
– జి.దేవమణి, కాంట్రాక్ట్ అధ్యాపకురాలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నల్లగొండ
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ లెక్చరర్ ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో 117మంది అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
– మాలె వెంకట్రెడ్డి, ఇంగ్లిష్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు రామన్నపేట