మిర్యాలగూడ, మార్చి 15 : రైతులు పండించిన నాణ్యమైన ధాన్యానికి మిల్లర్లు గిట్టుబాటు ధర అందించాలని డీఎస్ఓ వెం కటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశానుసారం మిల్లర్లు ఇష్టానుసారంగా ధాన్యం ధరలు తగ్గించరాదని, ధాన్యంలో తాలు పేరుతో కోతలు విధించరాదన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పి.శ్రీకాంత్, అగ్రికల్చర్ డైరెక్టర్ శ్రవణ్, ఆర్డీఓ శ్రీనివాస్రావు, డీటీ జావిద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్, మిర్యాలగూడ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.