నీలగిరి, ఫిబ్రవరి 8 : ఈ నెల 3న కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వ్యవసాయ కూలి పనులకు వచ్చిన సైదులు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అనుమానంతో అదే గ్రామానికి చెందిన మోదాల శ్రావణ్కుమార్ ఆయన బామ్మర్దులు బండారి వెంకటేశ్, బండారి సాయి పథకం ప్రకారం హత్య చేసినట్లు తేలింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలను వెల్లడించారు. కేతేపల్లి మండలం ఇప్పలగూడేనికి చెందిన మోదాల శ్రవణ్ కుమార్కు చెందిన వ్యవసాయ భూమిలో సైదులు కూలి పనులకు వెళ్లేవాడు.
ఆ సమయంలో శ్రవణ్ భార్యతో సైదులు చనువుగా ఉండడంతో శ్రవణ్ సైదులును పలుమార్లు హెచ్చరించాడు. అయినా తీరు మరకపోవడంతో శ్రవణ్కుమార్ హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు శ్రవణ్ బామ్మర్దులు కుడకుడ గ్రామానికి చెందిన బండారి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్, అదే ఇప్పలగూడెంలో నివాసముంటున్న బాబాయి కొడుకు బండారి సాయికుమార్ సాయం తీసుకున్నాడు. ముందుగా నిర్ణయించుకున్న పథకం ప్రకారం మద్యం తాగడం కోసం గ్రామ శివారులో ఉన్న ఐకేపీ సెంటర్ వద్దకు సైదులును వెంకటేశ్, సాయి తీసుకొచ్చారు.
అక్కడికి శ్రావణ్కుమార్ రావడంతో అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం తన భార్య వెంట ఎందుకు పడుతున్నావని శ్రవణ్ సైదులును అడుగగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో శ్రవణ్ కుమార్ వెంట తెచ్చుకున్న సుత్తెతో వెంకటేశ్ సాయంతో సైదులును బలంగా కొట్టి చంపాడు. ఎవరూ రాకుండా సాయి కాపాలా ఉన్నాడు. నిందితులు ఉపయోగించిన మూ డు సెల్ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు, సుత్తెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన సీఐ రాఘవరావు, ఎస్ఐ శివతేజ సిబ్బందిని మహేశ్, అజిత్రెడ్డిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో శాలిగౌరారం సీఐ రాఘవరావు, కేతేపల్లి ఎస్ఐ శివతేజ సిబ్బంది ఉన్నారు