హైవేపై ఆగి ఉన్న వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట వైపు వెళ్లే హైవేపై ఆగి ఉన్న వాహనాలను టార్గెట్ చేసుకొని వాహనదారుల వద్దకు వెళ్లి వాళ్లను కత్తులతో బెదిరించి డబ్బులు, సెల్ఫోన్లు లాక్కొని వెళ్లే గ్యాంగ్ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు.
గత సంవత్సరం సెప్టెంబర్లో కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై ఆగి ఉన్న, బ్రేక్డౌన్ అయిన వాహనాల్లో ఉన్న వాళ్లను నల్గొండకు చెందిన కమ్రాన్, మహమ్మద్, రాకేశ్ అనే ముగ్గురు దుండగులు కత్తులతో బెదిరించి వాళ్ల నుంచి డబ్బులు, నగదు లాక్కెళ్లారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. వాళ్లను అరెస్ట్ చేసి వాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఇలా.. వాహనదారులను ఆపి.. బెదిరింపులకు ఎవరైనా పాల్పడితే వెంటనే పోలీస్ వాళ్లకు సమాచారం అందించాలని నల్గొండ జిల్లా ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. అలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వాళ్లను ఉపేక్షించేది లేదని.. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.