సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 23 : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి బాధాకరమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్న వయసులో శాసన సభ్యురాలిగా ప్రజల మన్ననలతో ఎన్నికైన ఆమె అర్ధాంతరంగా దివంగతులు కావడం శోచనీయని పేర్కొన్నారు. ఆమె మరణం పట్ల ఆయన సంతాపం తెలిపారు. సాయన్న కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.