మిర్యాలగూడ ఫిబ్రవరి 21 : పట్టణంలోని నందిపాడు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) బైక్ పై వెళ్లున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై నుంచి హైదరాబాదు వైపు వెళ్తున్న కంటైనర్ నందిపాడు బైపాస్ వద్ద వేగంగా వెళ్తూ శరణ్య గ్రీన్ హోమ్స్ నుంచి రోడ్డుమీదికి అప్పుడే వస్తున్న ద్విచక్ర వాహనదారుడు పి భరతయ్య (75)వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భరతయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం ముందు ఉన్న డీసీఎం, ఆటోను సైతం ఢీ కొట్టడంతో వాహనాలు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. కంటైనర్ డ్రైవర్ రితేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భరతయ్య మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతుని బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. కాగా, గాయపడిన కంటైన డ్రైవర్ రితేష్ ను అంబులెన్స్లో దవాఖానకు తరలించారు. టూ టౌన్ సీఐ నాగార్జున కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.