
రామగిరి: కక్షిదారుల సత్వర న్యాయనికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని వాటి నిర్వహణ ఈనెల 11న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులో నిర్వహి స్తున్నట్లు న్యాయ సేవా అధికార సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ వెల్లడించారు.
మంగళవారం నల్లగొండ జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేవంలో న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.వేణుతో కలిసి ఆయన మాట్లాడారు. రాజీయోగ్యమైన సివిల్, క్రిమినల్, భూ పరిహార, భూవివాద, బ్యాంకు రికవరీ కేసులు, చెక్బౌన్స్ ఇతర కేసులు పరిష్క రించుకోవచ్చన్నారు.
రాజీ పడదగిన కేసులకు ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. లోక్అదాలత్లో తీర్పు వస్తే తిరిగి అప్పీలుకు అవ కాశం ఉండదన్నారు. ఉమ్మడి జిల్లాలో 1,500 వందల కేసులు రాజీ పడదగిన కేసులు గుర్తించి నోటీసులు సైతం అంది చామన్నారు. కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.