మునుగోడు ఉప ఎన్నికలో ధర్మం వైపు నిలిచి టీఆర్ఎస్కు పట్టం కట్టిన నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మరోమారు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో వివిధ శాఖల మంత్రులు నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన సోమవారం తొలిసారి మునుగోడు నియోజకవర్గానికి రాగా, చౌటుప్పల్ నుంచి చండూరు వరకు ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు, కోలాట ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు.
చండూరు, నవంబరు 14 : మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ధర్మాన్ని గెలిపించేందుకు టీఆర్ఎస్కు పట్టం కట్టారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం తొలిసారి చండూరు మండలానికి వచ్చిన ఆయనకు టీఆర్ఎస్ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు భారీ ర్యాలీతో ఎదురెల్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగడిపేట నుంచి చండూరు చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో కోలాట ప్రదర్శనలు, పటాకులు, కార్యకర్తల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. అనంతరం చండూరు చౌరస్తాలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుదామన్నారు. సంతలో పశువులను కొన్నట్లుగా రాజగోపాల్రెడ్డి ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసి గెలువాలని ప్రయత్నించారని, అయినా ప్రజలు తన వెంటే నడిచారని పేర్కొన్నారు. త్వరలో వివిధ శాఖల మంత్రులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో
నియోజకవర్గ అభివృద్ధిపై రోడ్మ్యాప్ రూపొందిస్తామన్నారు. నియోజకవర్గంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లను త్వరగా పూర్తి చేసి ప్రజల కాళ్లు కడుగుతానన్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక తన స్వలాభం కోసం ఉప ఎన్నిక తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన చేతకాని తనాన్ని నిరూపించుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనే అహంకారంతో ఎన్నికల బరిలో దిగిన ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. చండూరు పట్టణంతో పాటు పల్లెలను సమానంగా అభివృద్ధి చేసి తీరుతానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, రాష్ట్ర నాయకుడు బొల్లం శివశంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మాధవరెడ్డి, చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, ఎంపీపీలు పల్లె కల్యాణీరవికుమార్, కర్నాటి స్వామి, ఏడుదొడ్ల శ్వేతారవీందర్రెడ్డి , మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, పాశం సురేందర్రెడ్డి, నారబోయిన స్వరూపారాణీరవి ముదిరాజ్, ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, కౌన్సిలర్ కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, కోన్రెడ్డి యాదయ్య, చిలుకూరి రాధికాశ్రీనివాస్, సర్పంచ్ ముడిగె ఎర్రన్న, నాయకులు పెండ్యాల గీత, పెద్దగోని వెంకన్న, నల్లగంటి మల్లేశం పాల్గొన్నారు.
భారీ బైక్ ర్యాలీ
మునుగోడు : మండల కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మండలంలోని చల్మెడ, కొంపల్లి, చీకటిమామిడి గ్రామాల మీదుగా మునుగోడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యకమ్రంలోఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, వైస్ ఎంపీపీ అనంత వీణాలింగస్వామిగౌడ్ , ఎంపీటీసీలు ఈద నిర్మలాశరత్బాబు, బొడ్డు శ్రావణీనాగరాజుగౌడ్, చండూర్ మార్కెట్ డైరక్టర్ ఏరుకొండ శ్రీనువాస్, నాగరాజు, పొలగోని సైదులుగౌడు, మండల కార్యదర్శి పగిళ్ల సతీశ్, మునుగోడు గ్రామశాఖ ఆధ్యక్షుడు రావిరాల కుమార్స్వామి, పలివెల ఎంపీటీసీ చెరుకు కృష్ణయ్య, పూల వెంకటేశం, బోయపల్లి రవిగౌడ్, మాదగోని దేవలోకం నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చౌటుప్పల్లో ఘన స్వాగతం
చౌటుప్పల్ : ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్యాదవ్, షాదీఖానా చైర్మన్ ఎండీ ఖలీల్, నాయకులు కానుగు బాలరాజు, ముటుకుల్లోజు దయాకరాచారి, బడేటి సత్యానారయణగౌడ్. గుండబోయిన అంజయ్యయాదవ్, పోలోజు శ్రీనివాస్చారి పాల్గొన్నారు.
సంస్థాన్నారాయణపురంలో..
సంస్థాన్ నారాయణపురం : మండలానికి వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ శ్రేణులు వెయ్యి బైకులతో ఎమ్మెల్యే వెంట చండూరుకు ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్, సర్పంచ్ శ్రీహరి, పీఏసీఏస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, నాయకులు బోళ్ల శివశంకర్, నాయకులు తెలంగాణ భిక్షం, లారీ భిక్షం, పల్లె గోవర్దన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి. పలు గ్రామల సర్పంచులు పాల్గొన్నారు.
ఆందోళ్ మైసమ్మ ఆలయంలో పూజలు
చౌటుప్పల్ రూరల్ : ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సోమవారం మండలంలోని ఆందోళ్మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ చిట్టెడి వెంకట్రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ సిద్దిపేట శేఖర్రెడ్డి పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, టీఆర్ఎస్ మండలలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు మస్తాన్బాబు యాదవ్, మల్కాజిగిరి కృష్ణా పాల్గొన్నారు.