భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో మహిళలు సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం బతుకమ్మ చీరెలను ప్రతి ఏటా అందజేస్తుందని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణంలోని 8వ వార్డులో శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో పండుగలకు గుర్తింపు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల పండుగలకు కానుకులను అందజేస్తున్నారని చెప్పారు. పట్టణంలోని 35 వార్డుల్లో బతుకమ్మ చీరెలను కౌన్సిలర్లు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్, ప్రధానకార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు చెన్న స్వాతిమహేశ్, శంకర్, సుధాకర్రెడ్డి, భగత్, కోఆప్షన్ సభ్యుడు రమేశ్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : రాష్ట్రంలోని ఆడబిడ్డలు తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగను భావిస్తారని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను శనివారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బాబాషరీఫ్, ఆలె నాగరాజు, కామిశెట్టి శైలజ, బండమీది మల్లేశ్, బత్తుల స్వామి, మహిళలు పాల్గొన్నారు.