మిర్యాలగూడ, జూన్ 24 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన పోలెపల్లి లక్ష్మయ్య, దామరచర్ల మండలం కేశవపురం గ్రామానికి చెందిన కట్టెబోయిన దుర్గయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారు టీఆర్ఎస్ బీమా సభ్యత్వం కలిగి ఉండడంతో రూ.2లక్షల చొప్పున మంజూరైన బీమా చెక్కులను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మృతుల కుటంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దురగపూడి నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదయ్యయాదవ్, నాయకులు హతీరాంనాయక్, పాపారావు, గోవిందరెడ్డి, మల్లయ్య, వెంకటేశ్వర్లు, లింగానాయక్ పాల్గొన్నారు.
కల్వెలపాలెంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ
మాడ్గులపల్లి : మండలంలోని కల్వెలపాలెం కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీవిద్య, సర్పంచ్ గడ్డమీది సైదులు, సీనియర్ నాయకులు పొనుగోటి చొక్కారావు పాల్గొన్నారు.
చెన్నకేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని యాద్గార్పల్లిలో గురువారం రాత్రి నిర్వహించిన చెన్నకేశ్వర స్వామి పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి శోభాయాత్రలో ఎమ్మెల్యే భాస్కర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదయ్యయాదవ్, సర్పంచ్ దుండిగాల యాదమ్మాశ్రీనివాస్, ఉపసరంచ్ మల్లెబోయిన సుధాకర్, మాజీ సర్పంచ్ రవీందర్రెడ్డి, యాదవ సంఘం డివిజన్ అధ్యక్షుడు ఎర్రయ్యయాదవ్ పాల్గొన్నారు.