కోదాడ రూరల్, మే 20 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఢీ కొని ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధి కొమరబండ శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస్రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ కోదాడకు వస్తున్నారు.
విషయం తెలుసుకున్న మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త ఎస్కే నయాబ్ రసూల్ స్వాగతం పలికేందుకు కొమరబండ బైపాస్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను పవన్ కల్యాణ్కు షేక్హ్యాండ్ ఇచ్చిన అనంతరం తోపులాటలో కిందపడ్డాడు. వెనుక నుంచి వచ్చిన కాన్వాయ్ వాహనం ఆయన పైనుంచి పోయింది. దాంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన మరో కార్యకర్త అరవింద్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన నయాబ్స్రూల్ను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ దవాఖానకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. స్వల్పగాయాలైన అరవింద్ చికిత్స అనంతరం సూర్యాపేటకు వెళ్లిపోయాడు.