విజయవంతంగా పది మందికి అపరేషన్లు
విలేకరుల సమావేశంలో నిమ్స్ వైద్యులు
నీలగిరి: ఉమ్మడి నల్లగొండ జిల్లా వైద్య చరిత్రలో మరో మైలురాయిని జిల్లా ప్రజలకు అందించామని నల్గొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్(నిమ్స్) వైద్యులు తెలిపారు. జిల్లా వైద్య చరిత్రలో తొలిసారిగా పది మంది గుండె రోగులకు ఎం జీయోగ్రామ్లను విజయవంతంగా చేశామని చెప్పారు.
అదివారం నిమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా.శరత్చంద్ర మాట్లాడు తూ వైద్య పరంగా నల్లగొండ జిల్లాలో గుండె సంబంధిత కేసులను పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు అర్ధరాత్రి గుండెపోటు వచ్చి హైదరాబాద్కు వెళ్లే సమయం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
కానీ ఇక నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నిమ్స్లో వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో ఓపెన్ బైపాస్ సర్జరీలు ఇతర గుండెకు సంబంధించిన అన్ని రకాల అపరేషన్లు చేయడం జరుగుతుంద న్నారు. చాలా మంది జిల్లా ప్రజలు చిన్నారుల నుంచి పెద్దల వరకు గుండె సంబంధిత రోగాలతో బాధ పడుతూ హైదరా బాద్లాంటి పట్టణాలకు పోయి ఇబ్బందులు పడడంతో పాటు అర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు.
కేవలం రూ.7500లకే అంజీయోగ్రామ్ చేసినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన డాక్టర్లుగా ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసు కోవాలన్నారు. సమావేశంలో డాక్టర్లు ఎన్ సాయికృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి, పీ.వెంకట్రెడ్డి, రాజేశ్రెడ్డి, విజయ్కుమార్, వైవీ రాజశేఖర్రెడ్డి, సీఈవో వీరారెడ్డి, పీఆర్వో అజయ్కుమార్, మేనేజర్ మోత్కురు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.