సూర్యాపేట, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేంద్రాన్ని శుక్రవారం మంజూరు చేశారు. ఈ మేరకు 10 కోట్లు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. మెడికల్ కళాశాల, సమీకృత మార్కెట్, సమీకృత కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా కేంద్రం సకల సౌకర్యాలతో సమగ్రాభివృద్ధి చెందుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రగతి పనులు చేపడుతూనే సూర్యాపేటను రోల్మాడల్గా తీర్చిదిద్దేందుకు మంత్రి చర్యలు తీసుకుంటున్నారు. సివిల్ ఇంజినీరింగ్, ఐటీఐ, వివిధ టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ప్రస్తుతం నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్(న్యాక్) శిక్షణ కేంద్రం హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉండగా అక్కడికి వెళ్లలేని విద్యార్థులు, యువకులకు ఇది ఊరట కలిగించే విషయం. జిల్లా వాసులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో స్థానిక టెక్నికల్ విద్యార్థులు స్వాగతిస్తున్నారు.
సూర్యాపేట సిగలో మరో మైలురాయి
మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 7 : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా కేంద్రం సిగలో మరో మైలురాయి న్యాక్ చేరిందని సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ అన్నారు. న్యాక్ సెంటర్ ఏర్పాటుపై మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ భానుపురి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డిల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి జగదీశ్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు కుర్రి నర్సయ్య, జనరల్ సెక్రటరీ బొమ్మగాని వెంకన్న, ఉపాధ్యక్షుడు ఇరుగుదిండ్ల అంజయ్య, బొల్లికొండ వీరస్వామి, నిమ్మల వెంకన్న, రఫీ, పేరాల వెంకన్న, గ్యార విజయ్, ప్రేమ్కుమార్, రాంరెడ్డి, గోవర్ధన్, దాసరి నగేశ్, మల్లేశ్, రామాచారి, దుర్గయ్య, సలీం పాల్గొన్నారు.
మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 7 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నిషియన్స్ ఫెడరేషన్(టీపీఈటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు తోట శ్రవణ్కుమార్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన విద్యార్థులకు, భవన ఇతర నిర్మాణ కార్మికులకు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు న్యాక్ ఎంతో దోహద పడుతుందన్నారు. సమావేశంలో షేక్ నబి, షేక్ మహమూద్ అలీ, బి.శ్రీనివాస్, జానయ్య, సోమయ్య, విఠల్రెడ్డి, జానకిరామ్, రవి పాల్గొన్నారు.