డిండి, నవంబర్ 19: ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం కామేపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మండలంలోని ఎర్రారం, జాల్తండా, గోనబోయినపల్లి, ప్రతాప్నగర్, బొగ్గులదోన, కాల్యతండా, జేత్యతండా, కామేపల్లి, గోనకోల్, పెద్దతండా, బొల్లనపల్లి, భాక్యతండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు అయ్యాయని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
వివిధ పార్టీల నుంచి 70కుటుంబాలు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ బీఆర్ఎస్లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవరం దేవేందర్రావు, ఎంపీపీ మాధవరం సునీతాజనార్ధన్రావు, బీఆర్ఎస్ నాయకులు కేతావత్ బిల్యానాయక్, నేనావత్ కిషన్నాయక్, వడిత్యా రమేష్నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, పిఏసిఎస్ చైర్మన్లు శ్రీనివాసరావు, నాగార్జున్రెడ్డి, నాయకులు రాఘవాచారి, విష్ణువర్ధన్రెడ్డి, భగవంతరావు, గుర్రంరాములు, జంగిరెడ్డి, ఉస్మానియా జేయేసి నాయకులు లింగం, గిరమోని శ్రీనివాసులు, కాశన్న, కలీం, సురేష్, పున్న లింగమయ్య, వెంకటయ్య, కోండల్రావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ప్రచారంలో వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో భౌతిక దాడులకు పాల్పడుతోందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని సూ చించారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 50వేల మెజార్టీతో గెలుస్తుంని ఆయన ధీమా వ్యక్తం చేశారు.