నల్లగొండ : మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ శివారులోని ప్రసిద్ధ ఛాయా సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అభిషేకం నిర్వహించి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పచ్చల సోమేశ్వరాలయంలో పూజలు చేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ఇతర అలయాల్లోనూ పూజలు చేస్తూ భక్తులను పలకరిస్తూ పర్యటన కొనసాగించారు.