నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)/ నీలగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతో నల్లగొండ జిల్లా కేంద్రం రూపురేఖలు మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రగతి సారథి కేసీఆర్ మార్గదర్శనం, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక పర్యవేక్షణలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సంపూర్ణ సహకారం అభివృద్ధికి తోడైంది. దాంతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పట్టుదలతో నవ నల్లగొండ ఆవిష్కరణకు అడుగులు వేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించేందుకు సుమారు రూ.1,305 కోట్లను వెచ్చిస్తున్నారు. ఇప్పటికే పార్కుల ఆధునీకరణతోపాటు జంక్షన్ల అభివృద్ధి పూర్తయ్యింది. హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాగా మిగతా ప్రధాన రహదారుల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఐటీ హబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు సిద్ధమయ్యాయి. మెడికల్ కాలేజీ, ఎన్జీ కాలేజీ, ఆర్అండ్బీ గెస్ట్హౌస్,మర్రిగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కళాభారతి, ఉదయ సముద్రం ట్యాంక్బండ్, పట్టణంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతో నల్లగొండ జిల్లా కేంద్రం రూపురేఖలు మారిపోతున్నాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక పర్యవేక్షణకు జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సంపూర్ణ సహకారం తోడైంది. దీంతో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పట్టుదలతో నవ నల్లగొండ ఆవిష్కరణకు అడుగులు పడ్డాయి. ఇప్పటికే పార్కుల ఆధునీకరణతోపాటు జంక్షన్ల అభివృద్ధి పూర్తయింది. హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాగా, మిగతా ప్రధాన రహదారుల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఐటీ హబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మెడికల్ కాలేజీ, ఎన్జీ కాలేజీ, ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్, మర్రిగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కళాభారతి, ఉదయ సముద్రం ట్యాంకుబండ్, పట్టణంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించేందుకు సుమారు రూ.1305 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన ఐటీ హబ్తోపాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నల్లగొండకు వస్తున్నారు.ఆయన పర్యటన కోసం ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
సరిగ్గా ఏడాదిన్నర కిందటి నల్లగొండ జిల్లా కేంద్రానికి, నేటి నల్లగొండకు పొంతనే లేదు. గతంలో అధ్వానమైన రోడ్లు, శిథిలమైన డివైడర్లు, వెలిగీ వెలుగని లైటింగ్ వ్యవస్థ, అస్తవ్యస్థ జంక్షన్లు, నిర్లక్ష్యానికి గురైన పార్కులు.. ఇలా అన్నింటిలోనూ నిస్పృహ ఆవరించే వాతావరణం ఉండేది. జిల్లా కేంద్రమని చెప్పుకోవడానికి కూడా స్థానికులు ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 2021 డిసెంబర్ చివరి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తండ్రి మారయ్య దశ దినకర్మకు హాజరయ్యారు. ఆ సమయంలో కాన్వాయ్లో ప్రయాణిస్తూ పట్టణ పరిస్థితిని చూసి సీఎం కేసీఆర్ చలించిపోయారు. పాత జిల్లా కేంద్రమైన నల్లగొండ ఇంత అధ్వానంగా ఉంటే ఎలా అని జిల్లా నేతలను ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు.. వెంటనే జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నల్లగొండ పట్టణంలో పర్యటించారు. కలెక్టరేట్లో నల్లగొండపై ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తూ రెండేండ్లలో నల్లగొండ రూపురేఖలు మారాలన్నారు. అందుకు ఎన్ని నిధులైనా ఇచ్చే బాధ్యత తనదని ప్రకటించారు. రెండు రోజుల్లోనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డిని నల్లగొండకు పంపించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయించారు. అదే రోజు ఐటీ హబ్తోపాటు పలు పనులకు పునాదిరాళ్లు వేయించారు. దీంతో నవ నల్లగొండ ఆవిష్కరణకు అడుగులు పడ్డైట్లెంది.
తలమాణికంగా ఐటీ హబ్, రోడ్లు
హైదరాబాద్ రోడ్డు నుంచి నల్లగొండలోకి ప్రవేశిస్తుంటేనే అద్భుతమైన ఐటీ హబ్ జిల్లాకు తలమాణికంగా నిలుస్తున్నది. హైదరాబాద్లోని టీ హబ్ తర్వాత రూ.90కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఐటీ హబ్ నల్లగొండ సొంతమైంది. సరిగ్గా ఏడాదిన్నర కాలంలో దీన్ని ప్రారంభానికి సిద్ధం చేశారు. ఇప్పటికే పలు కంపెనీలు ప్లేస్మెంట్ కూడా పూర్తి చేశాయి. మంత్రి కేటీఆర్ దీన్ని నేడు ప్రారంభించనున్నారు. ఇక ప్రధాన మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్టవర్ సెంటర్ వరకు ప్రధాన రహదారి విస్తరణ పూర్తయింది. మూడు, ఆరు వరుసల రహదారితోపాటు సెంట్రల్ లైటింగ్, పచ్చదనంతో కూడిన డివైడర్లతో మెట్రో సిటీని తలపిస్తున్నది. మర్రిగూడ బైపాస్ జంక్షన్తోపాటు క్లాక్టవర్ జంక్షన్ షూటింగ్ స్పాట్లుగా మారిపోయాయి. క్లాక్టవర్ నుంచి పెద్దబండ వరకు, డీఈఓ ఆఫీసు నుంచి కలెక్టరేట్ మీదుగా కేశరాజుపల్లి వరకు ప్రధాన రహదారుల విస్తరణ, సెంట్రల్ లైటింగ్తో కూడిన డివైడర్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. క్లాక్టవర్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ప్రధాన రహదారి కొత్త హంగులు సంతరించుకున్నది. వైఎస్ఆర్ విగ్రహం నుంచి కతాల్గూడ వరకు ఆరు లేన్ల రహదారి విస్తరణ పనులు షురూ కానున్నాయి. ఇందుకోసం రూ.146కోట్లు వెచ్చిస్తున్నారు. వీటితోపాటు పట్టణంలోని అంతర్గత రహదారులు, అండర్గ్రౌండ్ డ్రేనేజీ కోసం గత వారమే మరో రూ.55 కోట్లు విడుదలయ్యాయి. ఇలా నల్లగొండ నలువైపులా అభివృద్ధి కొనసాగుతున్నది.
సీఎం కేసీఆర్ దత్తతతోనే నల్లగొండ దశ తిరిగింది
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతోనే నల్లగొండ దశ తిరిగింది. నల్లగొండపై సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ప్రేమ ఉన్నది. దీనికి మంత్రి జగదీశ్రెడ్డి సహకారం తోడైంది. వారి కనుసన్నల్లోనే ఎవరూ ఊహించని రీతిలో రూ.1300 కోట్లతో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పటికే ఐటీ హబ్, హైదరాబాద్ రోడ్డు, జంక్షన్లు, మార్కెట్లు, అంతర్గత రోడ్లు వంటి కీలకమైన పనులు పూర్తి చేశాం. మెడికల్ కాలేజీ, ఎన్జీ కాలేజీ, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. నేడు మరో రూ.660కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేస్తారు. రెండేండ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసుకుని నల్లగొండ మెట్రో నగరాలకు దీటుగా నిలువనుంది. నవ నల్లగొండ ఆవిష్కరణ కానుంది. ఇంతటి అద్భుత ప్రగతికి కారణమైన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు నల్లగొండ ప్రజల తరఫున కృతజ్ఞతలు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే
అభివృద్ధి పటంలో నల్లగొండకు ప్రత్యేక స్థానం
సీఎం కేసీఆర్ దత్తతతో నల్లగొండ పట్టణానికి వచ్చిన నిధులను మౌలిక సదుపాయాలు, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు పార్కులు, అరోగ్యాన్ని ఇచ్చేందుకు జిమ్లతోపాటు మెరుగైన విద్య, వైద్యం కోసం చర్యలు చేపట్టాం. మున్సిపల్ నిధులే కాకుండా అదనంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సహకారంతో రూ.1304 కోట్ల నిధులు సేకరించడం జరిగింది. ఆ పనులను రెండేండ్లలో పూర్తి చేసి అభివృద్ధి పటంలో నల్లగొండకు ప్రత్యేక స్థానం కల్పించేలా కృషి తచేస్తాం.
– మందడి సైదిరెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్
పట్టణంలో పూర్తి చేసిన పనులు
నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా తొలి దశలో కేటాయించిన నిధుల్లో ఇప్పటికే రూ.249 కోట్ల పనులు పూర్తయ్యాయి. వాటిలో రూ.146కోట్లతో ప్రధాన రహదారుల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, రూ.4కోట్లతో ఆరు జంక్షన్ల ఆధునీకరణ చేపట్టారు. రూ.1.40 కోట్లతో ఆరు స్వాగత ఆర్చీలు, డ్రైనేజీలు, రూ.5.89కోట్లతో పార్కుల అభివృద్ధి చేపట్టారు. రూ.8.05 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రూ.15 లక్షలతో మొబైల్ టాయిలెట్, రూ.1.66 కోట్లతో పట్టణ నిరాశ్రయుల కేంద్రం నిర్మించారు. రూ.1.51కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ.40లక్షలతో స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి చేపట్టారు. రూ.1.20కోట్లతో మీడియన్ ప్లాంటేషన్, రూ.27 లక్షలతో బస్తీ దవాఖానలు, రూ.15లక్షలతో అన్నపూర్ణ క్యాంటిన్ ఏర్పాటు చేశారు. రూ.45లక్షలతో పంచతత్వ పార్కు, 40లక్షల రూపాయలతో ఎమిరాల్డ్ గార్డెన్ ఏర్పాటు చేశారు. రూ.90 కోట్లతో ఐటీ టవర్, రూ.96లక్షలతో రైతుబజార్ నిర్మించారు. రూ.2.20కోట్లతో పారిశుధ్య వాహనాలు కొనుగోలు చేశారు. రూ.45లక్షలతో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ పనులు పూర్తి చేశారు. వీటన్నింటినీ మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సోమవారం ప్రారంభించి అందుబాటులోకి తేనున్నారు.
ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, లింకు రోడ్లు
నార్కట్పల్లి-అద్దంకి రహదారి నుంచి నల్లగొండ పట్టణంలోకి ప్రవేశించే మర్రిగూడ బైపాస్, పానగల్ బైపాస్లు ప్రమాదాలకు నిలయమయ్యాయి. దీంతో ఇక్కడ ైప్లెఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు ఎన్నో ఏండ్ల డిమాండ్గా ఉంది. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.46కోట్లతో పిల్లర్లతో కూడిన ైప్లెఓవర్కు శ్రీకారం చుట్టారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పానగల్ బైపాస్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. వీటితో పాటు ఐటీ హబ్ నుంచి ఏఎమ్మార్పీ కాల్వ మీదుగా ఉదయసముద్రం వరకు రూ.11కోట్లతో కొత్తగా లింక్ రోడ్డును నిర్మిస్తున్నారు. వీటితోపాటు వన్ టౌన్ పోలీసు స్టేషన్ నుంచి మునుగోడు ఈద్గాహ్ రోడ్డు వరకు పాతబస్తీలోని ప్రధాన రహదారిని రూ.4.5 కోట్లతో సీసీ రోడ్డుగా విస్తరించారు. మునుగోడు బైపాస్ రోడ్డు నుంచి ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ వరకు లింక్ రోడ్డును నిర్మించారు.
సకల సౌకర్యాల పార్కులు
పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాంనగర్లోని మున్సిపల్ పార్కును సకల హంగులతో తీర్చిదిద్దారు. దీంతో నిత్యం ప్రజలతో పార్కు కిక్కిరిసిపోతున్నది. ఎన్జీ కాలేజీ వెనుక భాగంలోని రాజీవ్పార్కును ఆధునీకరించారు. చర్లపల్లి వద్ద నీలగిరి అర్బన్ ఆక్సిజన్ పార్కును కొత్తగా ఏర్పాటు చేశారు. విద్యానగర్ పార్కును సకల హంగులతో అభివృద్ధి చేశారు. వీటి కోసం రూ.7కోట్లు వెచ్చించారు. వీటితోపాటు వల్లభరావు చెరువును సుందరీకరిస్తూ ట్యాంకుబండ్ కోసం రూ.15కోట్లు ఖర్చు చేస్తున్నారు. త్వరలోనే పానగల్ ఉదయసముద్రం ప్రాజెక్టు కట్టను రూ.75కోట్లతో ట్యాంకుబండ్గా తీర్చిదిద్దే పనులు మొదలు కానున్నాయి.
ఆధునిక భవనాలకు శ్రీకారం
నాగార్జున సాగర్ రోడ్డు నుంచి నల్లగొండలోకి ప్రవేశిస్తుంటే ఎస్ఎల్బీసీలో అద్భుతమైన మెడికల్ కాలేజీ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. 10 ఎకరాల్లో రూ.116కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతున్నది. వచ్చే ఏడాది వరకు ఇది అందుబాటులోకి రానుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నల్లగొండ ఎన్జీ కాలేజీకి నూతన భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. రూ.36కోట్లతో ఆధునిక సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అలాగే పట్టణం నడిబొడ్డున క్లాక్టవర్ సెంటర్లో రూ.6.25 కోట్లతో సూట్ రూమ్స్తో కూడిన ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు రూ.90కోట్లతో కళాభారతి, 12కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవన్నీ పూర్తయితే పట్టణానికి అన్ని వైపులా మరిన్ని హంగులు సమకూరనున్నాయి.
మౌలిక వసతులకు పెద్దపీట
నల్లగొండ సమూల అభివృద్ధ్దిలో భాగంగా మౌళిక వసతులకు సైతం పెద్దపీట వేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా 53.75 కిలోమీటర్ల రోడ్లు, 94.56 కిలోమీటర్ల డ్రైనేజీ, 13 పారులు, ఆరు కమ్యూనిటీ హాళ్లను అభివృద్ధి చేశారు. సకల హంగులతో ఇంటిగ్రేటెడ్ మారెట్ను నిర్మించారు. అదేవిధంగా మర్రిగూడ, కేశరాజుపల్లిలో రూ.27.27 లక్షలు వెచ్చించి బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. పట్టణంలో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసి, 11 వాల్ పెయింటింగ్స్ను పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు రూ.119.14 కోట్ల పనులు పూర్తి కాగా, మరో రూ.580.59 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అభివృద్ధి పనులే కాకుండా ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఓపెన్ జిమ్లు, ఆహ్లాదం కోసం పార్కులను అభివృద్ధి చేశారు. వీటితోపాటు వచ్చే 20 ఏండ్లను దృష్టిలో ఉంచుకుని అప్పటి అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నారు. 2040 నాటికి పెరిగే 10 లక్షల జనాభాకు అనుగుణంగా మౌళిక వసతులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపిస్తున్నది. వచ్చే రెండేండ్లలో అన్ని పనులను పూర్తి చేసి నల్లగొండను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది.